ఎస్ఐఆర్ సర్వేను పరిశీలించిన మహేష్ యాదవ్
– ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో ఇంటింటి పర్యటన
శేరిలింగంపల్లి – విశాల భారతి
హఫీజ్పేట్ డివిజన్ ఇంద్రారెడ్డి ఆల్వేన్ కాలనీలో బూత్ నంబర్లు 211, 212 పరిధిలో మంగళవారం నిర్వహించిన ఇంటింటి ఎస్ఐఆర్ సర్వేను బిజెపి రాష్ట్ర నాయకుడు మహేష్ యాదవ్ పరిశీలించారు. బూత్ అధ్యక్షులు, బీఎల్ఏలు, బీఎల్వోలు, సీనియర్ నాయకులు శ్రీధర్, కోటేశ్వర్ రావు, రవి గౌడ్లతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
