సెల్లార్ వ్యాపారాలు ఖాళీ చేయించాలి
– డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేసిన మిద్దెల మల్లారెడ్డి
మియాపూర్, విశాల భారతి
మియాపూర్ సర్కిల్ పరిధిలో ప్రధాన రోడ్డు పక్కన సెల్లార్లలో వ్యాపారాలు కొనసాగుతున్నాయని, వర్షాకాలంలో నీరు నిండి షార్ట్ సర్క్యూట్తో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని మిద్దెల మల్లారెడ్డి డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గతేడాది విజేత సూపర్ మార్కెట్ సెల్లార్లో నీరు నిండి కోట్ల నష్టం వచ్చిందని గుర్తుచేశారు. భవాని హార్డ్వేర్, అర్చన హాస్పిటల్, విజేత సూపర్ మార్కెట్ సహా పలు చోట్ల సెల్లార్ వ్యాపారాలను వెంటనే ఖాళీ చేయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.
