బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి.. బాధిత కుటుంబానికి బలరాం యాదవ్ అండ
– రూ.15 వేల ఆర్థిక సాయం అందజేత
కొండాపూర్ – విశాల భారతి
శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కాశీం వల్లి బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరాం యాదవ్ మానవతా హృదయాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గురువారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి నగదును అందజేశారు.ఆపదలో ఉన్న కుటుంబానికి సాయం చేయడం తన బాధ్యత అని, భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని బలరాం యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు.
