సైబర్ టవర్స్ ఫ్లైఓవర్పై కియా కారు బ్రేక్డౌన్
– రద్దీ వేళ ట్రాఫిక్కు అంతరాయం
– అప్రమత్తంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులు
సైబరాబాద్ – విశాల భారతి
హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ ఫ్లైఓవర్పై గురువారం ఉదయం కియా కారు బ్రేక్డౌన్ కావడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎన్ఐఏ జంక్షన్ నుంచి మెడికవర్ ఆస్పత్రి వైపు వెళ్లే మార్గంలో కారు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో వెనుక నుంచి వస్తున్న వాహనాలు వరుసగా నిలిచిపోయాయి. దీంతో ఫ్లైఓవర్పై ట్రాఫిక్ నెమ్మదించగా, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు కొద్దిసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ ప్రత్యామ్నాయంగా వాహనాలను మళ్లించారు. అనంతరం బ్రేక్డౌన్ అయిన కారును ఫ్లైఓవర్పై నుంచి సురక్షితంగా తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో కొద్దిసేపటికే ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది.రద్దీ సమయాల్లో వాహనం నిలిచిపోవడంతో కొంతదూరం వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా నివారించగలిగారు. వాహనదారులు కూడా పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించడంతో ట్రాఫిక్ను త్వరగా క్లియర్ చేయడం సాధ్యమైంది.ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణానికి ముందు వాహనం సాంకేతికంగా సక్రమంగా ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని తెలిపారు. రద్దీ సమయంలో అనవసరంగా లైన్లు మారకుండా లేన్ క్రమశిక్షణ పాటించాలని, ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని కోరారు. వాహనం బ్రేక్డౌన్ అయినప్పుడు వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించి, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు వాహనదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
