ఆర్టీఏ ఆఫీస్ జంక్షన్ వద్ద రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ అంతరాయం
– వాహనదారులకు పోలీసుల సూచనలు
సైబరాబాద్ – విశాల భారతి
హఫీజ్పేట్ నుంచి కొండాపూర్ వెళ్లే మార్గంలోని ఆర్టీఏ ఆఫీస్ జంక్షన్ వద్ద రోడ్డు దెబ్బతినడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై గుంతలు, విరిగిన స్తంభం, బ్యారికేడ్లు ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో కంజెషన్ ఏర్పడే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, దెబ్బతిన్న రోడ్డు వద్ద వాహనాలను నెమ్మదిగా నడపాలని కోరారు. ట్రాఫిక్ సిబ్బంది ఇచ్చే ఆదేశాలను పాటించాలని, లైన్ క్రమశిక్షణ పాటించి అకస్మాత్తుగా లైన్లు మారవద్దని విజ్ఞప్తి చేశారు. వాహనదారులు సహకరించాలని, పోలీసులు కోరారు.
